9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

26-07-2025 07:32 PM

గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రోగులకు అరుదైన చికిత్స చేశారు. గత 20 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళకు ముడుచుకుపోయిన పేగులను హెర్నియ ఆపరేషన్(Hernia operation)లో భాగంగా 4 గంటల పాటు శ్రమించి పేగులను విడదీసి ఆపరేషన్ నిర్వహించి అనంతరం మహిళ ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పురిటి నొప్పులతో ఉన్న మహిళకు ఉమ్మనీరు ఎక్కువగా ఉందని ఆ మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనిచ్చిందని ఆ మహిళ క్రిటికల్ పొజిషన్లో ఆసుపత్రికి రాగ ఆమెకు కూడ చికిత్స చేసి ఇబ్బంది పడిన మహిళను ఆపరేషన్ చేసి సక్సెస్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ఈ సర్జరీలో డాక్టర్ విపంచి, డాక్టర్ కేచరి, డాక్టర్ విజయ భాస్కర్, డాక్టర్ స్పందన పాల్గొన్నారు.