calender_icon.png 27 July, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత రైతుకు సింగరేణి ఆర్థిక సహాయం

26-07-2025 07:37:12 PM

మణుగూరు,(విజయక్రాంతి): ఓసీ-4 కట్ట తెగి పంట నష్టపోయిన గిరిజన రైతు తాటి భానుచందర్ కు సింగరేణి సంస్థ పంట నష్ట పరిహారం అందజేసింది. శనివారం జీఏం కార్యాలయంలో జనరల్ మేనేజర్  దుర్గం రామ చందర్ రైతుకు రూ.3,42,720/- పంట నష్ట పరిహారం చెక్ ను అందించారు. 2022-23 సంవత్సరంలో ఓసీ-4 కట్ట తెగడంతో పంట నష్టం జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిఎం (పర్సనల్) రమేష్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్ పాల్గొన్నారు.