22 June, 2026 | 1:27 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

అర్హులందరికీ రేషన్ కార్డుల మంజురు

31-07-2025 01:27 AM

ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ 

వారసిగూడ జూలై 30 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.

సికింద్రాబాద్ తొమ్మిదో రేషన్ సర్కిల్ పౌర సరఫరాల అధికారి శ్రీమతి చాముండేశ్వరి నేతృత్వంలోని పౌర  సరఫరాల అధికారుల బృందం బుధవారం సితాఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పద్మారావు గౌడ్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ పౌర సరఫరాల విభాగం కార్యకలాపాలను సమీక్షించా రు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులకు కార్డులు జారీ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.