15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లక్ష్యాన్ని ఛేదించేలా చదవండి

23-10-2025 01:41 AM

కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ను తనిఖీ చేసిన కలెక్టర్ 

దేవరకద్ర, అక్టోబర్ 22: మండలం కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా  పాఠశాలలో ఆవరణను పరిశీలించి. పాఠశాల ఆవరణం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ రాజ్ ఈ ఈ ని ఆదేశించారు. 10 వ తరగతి గదికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు మెనూ,ఆహార నాణ్యత ఎలా ఉంది? విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు.

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత శాతం సాధించాలని అన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.మెనూ పాటించక నాణ్యమైన భోజనం అందించక నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కలెక్టర్ వెంట స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.