1 July, 2026 | 11:08 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సరస్వతి పుష్కరాల పనులను పరిశీలించిన ధార్మిక సలహాదారు

13-04-2025 09:28 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): మే నెలలో జరిగే సరస్వతి పుష్కరాల పనులను తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్మిక సలహాదారు గోవిందా హరి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాల పనులను ధార్మిక సలహాదారు పరిశీలించి పలు సూచనలు చేశారు. గోవిందా హరి మాట్లాడుతూ సరస్వతి ఘాటు వద్ద సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులను మరియు నూతన ఘాట్ నిర్మాణం పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. అనంతరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి రాగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి అభిషేకం అమ్మవారి దర్శనం అనంతరం ఈవో మహేష్ ఆధ్వర్యంలో స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పూజారులు వేద పండితులు పాల్గొన్నారు.