18 April, 2026 | 11:43 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

అక్రమ నిర్మాణాల తొలగింపు

07-05-2025 12:48 AM

చేవెళ్ల, మే 6:మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని  పలు అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. మంగళ వారం తహసీల్దార్ కె.గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ ఐ రోజా , అదనపు ఆర్ ఐ రాజేష్ నేతృత్వంలో రెండు బృందాలు స్థానిక పోలీసుల సహకారంతో కూల్చి వేతలు చేపట్టారు.

ఉదయం చిల్కూర్ పరిధిలోని ప్రభుత్వ శిఖం భూమి సర్వే నెం 457 లో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డును జేసీబీతో కూల్చి వేశారు. అలాగే ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ కి వేసిన రోడ్డును త్రవ్వి క్లోజ్ చేశారు. మధ్యాహ్నం  అజీజ్ నగర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెం. 49 లో ఎకరం భూమిలో నిర్మిస్తున్న రెండు గదులను నేలమట్టం చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది బాలకృష్ణ, ఎల్లయ్య, వాటర్ వరక్స్ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.