27-01-2026 01:50:14 AM
హైదరాబాద్, జనవరి 26: 77వ భారత రిపబ్లిక్ డే వేడుకలను సోమవారం కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్, రీజనల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జోనల్ హెడ్ కె.ధారాసింగ్ నాయక్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ హెడ్ ఉజ్జల్ చంద్ర,రీజనల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్, సీఎఫ్బీ హెడ్ వి.దేవేంద్ర, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఆయా బ్యాంకు సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.