4 July, 2026 | 8:02 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •   కొద్దిపాటి వర్షాలకే కూలిన ఇల్లు   •   ఎస్ఆర్పీ 3 గనిని సందర్శించిన జీఎం   •   తెలంగాణ సాయుధ పోరాట వీరుడు ‘దొడ్డి కొమురయ్య’: కలెక్టర్ కుమార్ దీపక్   •   ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి   •   రక్తదానమే ప్రాణదానం.. యువత సేవాభావంతో ముందుకు రావాలి: ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర   •  

ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా కలెక్టర్‌కి వినతి

19-07-2025 12:12 AM

కడ్తాల, జులై 18 : మండలంలోని చరికొండ గ్రామంలో ఉన్న ఎంపీహెచ్‌ఎస్ పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థుల కొరత తీవ్రంగా వేధిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాలకూర్ల మహేందర్ గౌడ్, వెంకటయ్య,జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కాసాని కాటం లు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉండగా సబ్జెక్టుల వా రిగా గణితం,భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయ పోస్ట్లు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానంటూ వారికిహామీనిచ్చారు.