calender_icon.png 13 October, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌పై ప్రతికార దాడులు నిజమే!

13-10-2025 01:21:00 AM

  1. 58మంది పాక్ సైనికులు హతం.. మరో 30 మందికి గాయాలు
  2. మా ఆధీనంలో 25 ఆర్మీ పోస్టులు 
  3. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడి

కాబుల్, అక్టోబర్ 12: తమ దేశ రాజధాని కాబుల్‌తో పాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ బాంబు దాడులకు పాల్పడిందని.. ఈ నేపథ్యంలో పొరుగు దేశ దళాలే లక్ష్యంగా ప్రతికార దాడులు చేపట్టామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ దాడుల్లో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, మరో 30మంది గాయపడ్డారని వెల్లడించారు.

ఇస్లామాబాద్ పదే పదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులను ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరిం చింది.  కాగా, ఇటీవల అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు ఆ దేశ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ దాడులపై ఇస్లామాబాద్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నప్పుడు ఈ దాడులు జరిగాయి.