17 April, 2026 | 11:13 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రెవెన్యూ రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలి

16-05-2025 12:00 AM

-కలెక్టర్ అభిలాష అభినవ్

రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల్లో పెండిం గ్లో ఉన్న భూసమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.

భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదు లను తక్షణమే పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అటవీశాఖతో ఉన్న భూ వివాదాలపై రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కలిసి సర్వే చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు.

ప్రతి మండలానికి సంబంధించిన భూముల వివరాలతో సమ గ్ర ప్రొఫైల్ తయారు చేయాలని, భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కుంటాల మండలంలో ప్రస్తుతం ఉన్న భూ సమస్యల పరిష్కార దశలను కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో అద నపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.