తలమడ్ల ఆరేపల్లి గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులు
02-10-2025 12:23 AM
రాజంపేట, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల ఆరేపల్లి గ్రామాల మధ్య బుధవారం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా చెడిపోయింది. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీలని దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టారు.




