ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

01-05-2024 01:21:43 AM

వికారాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన యాలాల్ మండలం దౌలాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తూర్పు రాజప్ప(50) తాండూరు ఆర్టీసీ డిపోలో పెట్రోల్ పంప్ విభాగంలో విధులు నిర్వహించేవాడు. ఇటీవల రాజును అధికారులు పెట్రోల్ పంప్ విభాగం నుంచి మరో విభాగంలోకి మార్చారు. దీంతో గత పదిహేను రోజులుగా ఆరోగ్యం భాగోలేదంటూ విధులకు వెళ్లలేదు. మంగళవారం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  తన ఆత్మహత్యకు కారణం డిపో అధికారులేనని సంఘటన స్థలంలో ఓ సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ తనే రాశాడా...? ఇంకెవరైనా రాశారా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.