calender_icon.png 12 July, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయలో 3 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు

12-07-2025 03:11:57 PM

అభినందించిన ఎంఈఓ జుంకీలాల్

జూలూరుపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు రోడ్డులో గల సాయి ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థులు నవోదయలో 3 సీట్లు సాధించినందుకు శనివారం జూలూరుపాడు మండల విద్యాధికారి జుంకీలాల్ ప్రవేశ పరీక్ష లో విజయం సాధించిన విద్యార్థులను తన కార్యాలయంలో అభినందించారు. నవోదయలో అర్హత సాధించిన వారిలో  1). భరత్ కార్తికేయ, 2). నండ్రు విశ్వ సన్నిధ్ 3). కొలిపోక  యశ్వంత్ లు ఉన్నారు. 

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ... విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసుకువచ్చి నవోదయ ప్రవేశ పరీక్షలో విజయం పొందేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయుల ప్రతిభ ఎంతో గొప్పదని అభినందించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం నిర్వహించే పోటీ పరీక్షలో మరిన్ని విద్యాలయాల్లో సీట్లు సాధించేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు మరింత సాధన అందించి ఉత్తమ విద్యార్థులను మరింత మందిని తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా విద్యార్థులతో విజయం సాధిస్తూ సాయి ఎక్స్ లెంట్ స్కూల్ ను జిల్లా స్థాయిలో రాణిస్తున్నందుకు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మండల ప్రజలకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ కు పిల్లలను పంపిన తల్లిదండ్రుల నమ్మకాన్ని, శ్రమతో పిల్లలకు అందుబాటులో ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపించి వారి విలువైన సమయాన్ని విద్యార్థులకు కేటాయిస్తూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఎంత విజయాన్ని సాధించామని అన్నారు.