10 May, 2026 | 8:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కోల్ ఇండియా ఛైర్మన్ గా సాయిరామ్

20-09-2025 11:55 PM

మందమర్రి,(విజయక్రాంతి): కోల్ ఇండియా చైర్మన్ గా బి సాయిరాం ఎంపిక అయ్యారు. కోల్ ఇండియా చైర్మన్ పదవి కోసం శనివారం న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించగా ఎంపిక చేసిన 10 మంది అధికారులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) నూతన ఛైర్మన్ గా బి సాయిరాంను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఈఎస్బి) సిఫార్సు చేసింది.

మొత్తం పదిమంది అధికారులు కోల్ ఇండియా చైర్మన్ పదవికి పోటీ పడగా కోలిండియా ఛైర్మన్ పదవి సాయిరామ్‌ ను వరించింది. ప్రస్తుతం నార్తర్న్ కోల్ లిమిటెడ్   చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) బాధ్యతలు నిర్వహిస్తున్న సాయిరామ్  ఛైర్మన్ గా  ఎంపిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా కోల్ ఇండియా ప్రస్తుత చైర్మన్ పిఎం ప్రసాద్ పదవీకాలం అక్టోబర్ 31, 2025 వరకు ఉంది.