1 April, 2026 | 1:37 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

తుంగతుర్తి కోర్టు నిర్మాణంకు 29 కోట్లు మంజూరు హర్షణీయం

28-07-2025 01:57 PM

తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనపర్తి జ్ఞాన సుందర్

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు తుంగతుర్తి సివిల్ కోర్టు నిర్మాణానికి 29 కోట్లు నిధులు మంజూరు చేయడం హర్షనీయమని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నూతన కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో కోర్టు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ, కచ్చిదారులకు ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో కోర్టు నిర్మాణం లేకపోవడంతో ఒక ప్రక్క కచ్చిదారులు మరొక ప్రక్క కోటి సిబ్బంది నిత్యం కష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో నూతన కోర్టుకు ప్రభుత్వం 29 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని హర్షించదగ్గ విషయమని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో సబ్ కోర్టు కూడా ఏర్పాటుకు, హైకోర్టు అధికారులతో మాట్లాడి న్యాయవాదులు అంత కృషి చేస్తామని హామీ ఇచ్చారు.