23 June, 2026 | 2:11 PM

Breaking News

పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •   తడిసిన ధాన్యం పేరుతో రైతుకు టోకరా!   •  

ప్రభుత్వ భూమిని కాపాడండి సారూ..

04-11-2025 12:13 AM

కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 03: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు మచ్చ జంగయ్య ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మచ్చ జంగయ్య, ఉపాధ్యక్షులు గంటీల వెంకటేష్ మాట్లాడుతూ.. మంచాల మండల పరిధి, ఆగపల్లి గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 191,187 లలో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

గతంలో రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా రెండు రోజులు సర్వే చేసి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి బోర్డు నాటించారు. కానీ ప్రభుత్వ అధికారులను కాదని వెంచర్ నిర్వాహకులు బోర్డుని అక్కడ నుంచి తీసివేయడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్థానిక రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ భూమిలో నుండి రోడ్డు నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ెుడల మంచాల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.