15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

03-01-2026 01:26 PM

మహిళల హక్కుల పోరాటానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే

మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు స్పూర్తి.

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో( Jangampalli village) మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి మహిళల ఆర్థిక స్వతంత్రానికి,కుల వివక్షతకు కృషి చేసిన మహనీయురాలని జంగంపల్లి సర్పంచ్ వాణి వాసు యాదవ్ అన్నారు. శనివారం  సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ  భర్త జ్యోతిరావు పూలే  ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు,సామాజిక సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ వాణివాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సిద్దారములు, వార్డ్ సభ్యులు సుజాత, అరుణ, ఎల్లవ బాను ప్రకాష్ బుచ్చయ్య రవి ,యశ్వంత్, సిద్దారములు, గ్రామ పెద్దలు బాలచంద్రం శివలింగం  సత్యం లు పాల్గొన్నారు.