calender_icon.png 27 September, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో కేటుగాళ్ళు... సినీ పకీలో మోసాలు

26-09-2025 11:45:05 PM

ఖమ్మం,(విజయక్రాంతి): వింత వింత పోకడలతో ఖమ్మంలో కేటుగాళ్లు సంచరిస్తున్నారు. సినీ పకీలో సంచులు వదిలేసి అందులో బంగారు బిస్కెట్ దొరికినట్టు నటించి మనం పంచుకుందామని నమ్మవలసి ఎదుటివారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇటువంటి సంఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మెహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఓ అపరిచిత మహిళ ముందు వెళ్తూ ఆమె చేతిలోని ప్యాకెట్ జారవిడిచి ఆపై ఆమే ప్యాకెట్ తెరిచి బంగారు బిస్కెట్ దొరికిందని చెబుతుండగా మరో వ్యక్తి వచ్చి బంగారు బిస్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని నమ్మిస్తారన్నారు.

ఇదంతా నిజమేనని నమ్మిన ఓ మహిళ తన వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, రూ.10వేల నగదును అపరిచిత మహిళకు ఇవ్వడమే కాక మిగతా నగదు తెచ్చి ఇస్తానని చెప్పి మోస పోయిందని, ఇందుకు సంబంధించి బాధితురాలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా నిందుతులు నగరంలో తిరుగుతూ దొరికిన బంగారు బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి నకిలీ బంగారంతో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మెహన్ బాబు తెలిపారు. ఫోటోలోని నిందుతులు ఎక్కడైన కనిపిస్తే ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712659115, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.