18-12-2025 05:42:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 20న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసి కమిటీల సమావేశం నిర్వహించుకుని పాఠశాల అభివృద్ధిపై చర్చించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ సమావేశంలో పోషక ఆహారోత్సవం పాఠశాల అభివృద్ధి విద్యా ప్రణాళిక పాఠశాల అవసరాలు అంశాలపై చర్చించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో ఈ సమావేశాలు నిర్మించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.