03-07-2025 12:24:35 AM
ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : చిన్ననాటి విషాదాలను, పేదరికాన్ని జయించి సెయిలింగ్లో అద్భుత ప్రతిభను కనబరిచిన ముగ్గురు తెలుగు యువకులు నవీన్(13), సాత్విక్ ధోకి(14), రిజ్వాన్ మహమ్మద్(15) భారత నౌకాదళంలో చేరనున్నట్లు కోచ్ సుహీమ్ షేక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోవాలోని నేవీ యూత్ స్పోర్డ్స్ కంపెనీ(ఎంవైఎస్సీ)కి ఎంపికయ్యారని తెలిపారు.