24-05-2025 12:32:42 AM
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టాండింగ్ కమిటీ అడిషనల్ అడ్వకేట్ గా నియమితులై మొదటిసారిగా మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ శుక్రవారం కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ తో పాటు కిషన్ యాదవ్, అజయ్, రవీందర్, స్వామి, పిఎస్ అశోకన్, సుబుద్దిన్, వేణు, జర్నలిస్ట్ సభ్యులు పాల్గొన్నారు.