27-09-2025 08:40:32 PM
కొత్తగూడెం, (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ సందర్బంగా బతుకమ్మ ఘాట్లలో, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు శనివారం అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతి, పోలీస్, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులతో అయన ఫోన్లో తగుసూచనలు, సలహాలు అందించారు. ఘాట్లలో ప్రమాదాలు చోటుచేసు కోకుండా అత్యవసర నిర్మాణాలు చేపట్టాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు. పొలిసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మ ఆటలు ఆడే గ్రామ, బస్తి సెంటర్లలో, దుర్గామాత మంటపాలు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్, పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. మహిళల నుంచి ఎలాంటి ఫిర్యాదులొచ్చినా చర్యలకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ముర్రేడు వాగు ప్రధాన బతుకమ్మ ఘాట్ అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలో పనులు పూర్తవుతాయని కూనంనేని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అయన ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.