16 April, 2026 | 6:25 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

24-11-2025 12:33 AM

48 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్ర పేర్కొన్నది.

అనంతరం 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం వరకు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం కూడా ఏర్పాడే అవకాశం ఉన్నదని వివరించింది.

మరోవైపు రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 11.6 డిగ్రీలు, ఆదిలాబాద్ భీమ్‌పూర్‌లో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది.