calender_icon.png 22 August, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో తీవ్రంగా యూరియా కొరత

22-08-2025 01:30:59 AM

మాజీ మంత్రి  గుంత కండ్ల జగదీశ్ రెడ్డి  

నల్లగొండ టౌన్, ఆగస్టు 21 : నెల రోజులుగా నల్లగొండ జిల్లాలో  యూరియా కొరత తీవ్రంగా వేదిస్తుందని ఇది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని రైతులు నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకుని అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీఆరెస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెడితే ఒక్క బస్తా యూరియా మీద దిగుబడి ఆధార పడి ఉంది.

కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. కెసిఆర్ వేసవిలోనే గోదాముల్లో ఎరువులు నిల్వ చేసి పెట్టేవారని వ్యవసాయ రంగం పై రెగ్యులర్ రివ్యూ చేస్తూ రైతుల ఇబ్బందులు పడకుండ జాగ్రత్త పడేవాళ్లమని గుర్తు చేశారు. కనీసం సీజన్లో నాలుగు సార్లు రివ్యూ జరిగేది రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం ఇబ్బందులు పడడం దారుణం అన్నారు. గతంలో ధాన్యం కొనుగోళ్లకు రైతులు ఇబ్బంది పడ్డారని కరెంట్ కోసం ఇబ్బందులు మొదలయ్యాయని యూరియా కొరత వెనక కొంతమంది మంత్రులు, అధికారులు ఉన్నారని ఆరోపించారు.

కమీషన్ల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసేందుకు కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి 56 సార్లు వెళ్లిన సీఎం కనీసం ఎరువులు తేలేవా? అని ప్రశ్నించారు. పోలీసులతో పహారా, లాఠీఛార్జ్ లతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని పదవులు తెచ్చుకునే కాంగ్రెస్ నేతలకు రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు.

నల్లగొండ నియోజక వర్గంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. అధికారుల ప్రకటన నిజం అయితే రైతులు ఇవ్వాళ కూడా ఎందుకు క్యూ లైన్ల లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా రైతులు ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు గదారి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.