calender_icon.png 22 August, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా

22-08-2025 01:26:14 AM

  1. మాదాపూర్‌లో ఆక్రమణల తొలగింపు 
  2. జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో కూల్చివేతలు 
  3. ఆక్రమణదారులపై కేసులు

గచ్చిబౌలి, ఆగస్టు 21 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని అక్రమ నిర్మాణాలతో పాటు రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడారు.  కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. దాదాపు 22 ఎకరాల లేఅవుట్‌లో సుమారు 100 ప్లాట్లు ఉన్నాయి. అలా గే దీనిలో 4 పార్కులు, రోడ్లు ఉండగా దీని లో రెండు ఆక్రమణకు(దాదాపు 8,500 గజాలు)గురయ్యాయి.

ఇంకా ఐదు వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురయిం ది. లే అవుట్ ప్రకారం జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్‌డీడ్ చేసిన పార్కులను ఓ వ్యక్తి కబ్జా  చేసిన ట్లు జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై రెవెన్యూ విభాగంతో హైడ్రా అధికారులు  సమీక్ష జరిపి ఆ స్థలాన్ని ఆక్రమించినట్లు నిర్ధారించారు. 

రూ. 400 కోట్లు ఆదా

రెండు పార్కులు, ఒక రహదారి, ప్రభు త్వ స్థలం కలిపి దాదాపు 16 వేల గజాలు అక్రమాలకు గురైనట్టు తేలింది. వీటి విలు వ సుమారు రూ. 400 కోట్లు ఉంటుందని అంచనా.  హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు గురువారం సిబ్బంది ఆక్రమణలను  తొలగించారు. పార్కు స్థలంలో హైడ్రా అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ చేశారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.

పార్కులను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు కాలనీవాసులు హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో కూడా ఆక్రమణలు బయటపడ్డాయి. సుమా రు 300 గజాల స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి షెడ్ నిర్మించారని గుర్తించిన అధికారులు దానిని కూల్చివేసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.