12-07-2025 05:01:03 PM
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు..
సిద్దిపేట (విజయక్రాంతి): బంగారు మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) అన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దేశానికే ఆదర్శమని, నా స్వంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్దతో కట్టిస్తానో అలానే కేసీఆర్నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంకు అంతే శ్రద్దతో ఉన్నానని, దాదాపు 100కు పైగా ఇక్కడి వచ్చి ప్రతి ఇళ్లు ఎలా ఉండాలో చెప్పి పేదింటి కల నెరవేర్చన్నారు. సకల హంగులతో నిర్మాణం చేపట్టమని చెప్పారు. ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇచ్చామని, ప్రతి ఇంటి ముందు చెత్త ఉండొద్దని, ప్లాస్టిక్ వాడొద్దని సూచించారు. బంగారు మైసమ్మ బోనాల పండుగ ఘనంగా అద్భుతంగా నిర్వహించారని నిర్వహకులను అభినందించారు.