21-05-2025 01:19:26 AM
- నామకరణం చేసిన కాలనీవాసులు
కామారెడ్డి, మే 20 (విజయక్రాంతి): ఇటీవల పాకిస్థాన్పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం చేసిన విషయం తెలిసిందే. సైన్యం చేసిన సిందూర్ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆ పేరును ఆదర్శంగా ఉంచేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ ప్రాంతంలోని ఓ వీధికి స్థానికులు సిందూర్ వీధిగా మంగళవారం నామకరణం చేసి బోర్డును ఏర్పాటు చేశారు. భారత సైనికుల త్యాగం మరువకుండా ఉండాలనే ఉద్దేశంతో కాలనీలోని వీధికి సిందూర్ వీధిగా పేరు పెట్టినట్లు కాలనీవాసులు తెలిపారు.