20 March, 2026 | 8:42 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం

10-07-2024 12:34 AM

ప్రపంచ చాంపియన్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందన

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పేసర్ సిరాజ్.. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిరాజ్‌కు ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంచలంచెలుగా ఎదుగుతూ.. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తి అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.