12-05-2025 12:00:00 AM
రామకృష్ణాపూర్ మే 11: ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి ఆదివారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు.వీరమరణం పొంది న జవాన్లకు జోహార్లు అర్పించారు.
గద్దరేగడి 63వ జాతీయ రహదారి భారత జవాన్లకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు.పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ పేరు తో భారత సైన్యం పోరాటం చేస్తుందని దీనికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.పాక్ జరిపిన కాల్పుల్లో మన జవాన్లు అమరులయ్యారని వారి సేవలు మారువలే నివాని కొనియాడారు.