17 June, 2026 | 11:35 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

సదరన్ ట్రావెల్స్ అరుదైన ఘనత

11-09-2025 01:04 AM

-రెండోసారి ఇండియా ట్రావెల్ అవార్డు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రముఖ ప్రయాణ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ పర్యాటక రంగంలో తన అసాధారణమైన సేవలకు మరోసారి గుర్తింపు పొందింది. 2025 ఇండి యా ట్రావెల్ అవార్డ్స్ ట్రావెలర్స్ చాయిస్ ఎక్సలెన్స్ అవార్డును మంగళవారం న్యూఢిల్లీలో ఘన కార్యక్రమంలో అందుకుంది.

ఈ అవార్డును మరోసారి అందుకోవడం ద్వారా సదరన్ ట్రావెల్స్ తన విశిష్ట స్థానాన్ని తిరిగి నిరూపించుకుంది. ఈ అవార్డును కేంద్ర ప ర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్, సుమన్ బిల్లా (డైరెక్టర్ జనరల్, పర్యాటక శాఖ, భారత ప్రభు త్వం), అశ్విని లోహాని (సభ్యులు, జాతీయ పర్యాటక సల హా మండలి) అందజేశారు.

సదరన్ ట్రావె ల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ అలపాటి మాట్లాడుతూ.. “2025 ఇండియా ట్రావెల్ అవార్డు రెండోసారి అందుకోవడం మాకు గొప్ప గౌరవం. మా కస్టమర్ల విశ్వా సం, మరియు మా సంస్థ సిబ్బంది అం కితభావంతో చేసిన కృషికి ఇది గుర్తింపు” అన్నారు.