30-01-2026 07:31:18 PM
మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు టి. రవి కిరణ్ ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉన్న ప్రస్తుత శాంతి భద్రతా పరిస్థితులు, చేపట్టిన చర్యలు తదితర అంశాలను ఎన్నికల పరిశీలకులకు వివరించారు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు.