1 April, 2026 | 7:15 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

భీమలింగం వద్ద సీఎం పుట్టినరోజు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు

08-11-2025 03:14 PM

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో భీమలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని సహదేవ్, కొండూరు భాస్కర్, కాసుల వెంకన్న, జక్క జంగారెడ్డి, మైసోల్లా ప్రవీణ్, సయ్యద్ బాబా, బద్దం సంజీవరెడ్డి పాల్గొన్నారు.