21 July, 2026 | 9:25 PM

Breaking News

బూర్గంపాడు గ్రంథాలయానికి మూత్రశాలల సౌకర్యం కల్పించాలి   •   ప్రకృతి ఆరాధనకు ప్రతీక శీతల భవానీ పండుగ   •   ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •  

7న శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మూసివేత

04-09-2025 12:15 AM

వలిగొండ, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఈ నెల 7న ఆదివారం ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణంతో మూసివేనున్నట్లు ఆలయ చైర్మన్ కుమార్ రెడ్డి నరేష్ రెడ్డి, ఈవో సెల్వాద్రి మోహన్ బాబు తెలిపారు.

7న ఆదివారం రోజు ఆలయం మద్యాహ్నం 12 గంటల లోపు స్వామి వారి నిత్య పూజాదికాలు, నివేదన ముగించి ద్వార బంధనం చేయబడుతుందని దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయం తిరిగి ఈనెల 8న సోమవారం రోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి ఆలయం తెరవబడడం జరుగుతుందని భక్తులు గమనించాలని కోరారు.