11 May, 2026 | 10:50 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్

29-09-2025 06:05 PM

తాడ్వాయి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా తాడువాయి మండల కేంద్రానికి చెందిన అంకాలపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బిజెపి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని తెలిపారు. 1995 నుంచి 2006 వరకు సామాన్య కార్యకర్తగా కొనసాగానని తెలిపారు. 2006 నుంచి క్రియాశీల సభ్యునిగా బాధ్యతలు నిర్వహించానన్నారు. రెండు పర్యాయాలు మండల ప్రధాన కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా కార్యవర్గ సభ్యునిగా కొనసాగినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత చురుకుగా పనిచేసి పార్టీకి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.