25 March, 2026 | 12:28 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

ఎస్సారెస్పీ నీరే తుంగతుర్తి పంటలకు జీవనాధారం

08-01-2026 12:10 AM

బయ్యన్న వాగు స్టేజ్2 ద్వారా నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, జనవరి 7 : ఎస్సార్‌ఎస్పీ  జలాలు రావడం తో తుంగతుర్తి నియోజకవర్గం లోని పంటలకు జీవం పోసినట్లు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బయ్యన్న వాగు స్టేజ్2 పనుల ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు నీటిని బుధవారం ఎమ్మెల్యే మందుల సామెల్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు రావడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.