13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఎస్సారెస్పీ నీరే తుంగతుర్తి పంటలకు జీవనాధారం

08-01-2026 12:10 AM

బయ్యన్న వాగు స్టేజ్2 ద్వారా నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, జనవరి 7 : ఎస్సార్‌ఎస్పీ  జలాలు రావడం తో తుంగతుర్తి నియోజకవర్గం లోని పంటలకు జీవం పోసినట్లు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బయ్యన్న వాగు స్టేజ్2 పనుల ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు నీటిని బుధవారం ఎమ్మెల్యే మందుల సామెల్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు రావడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.