21-09-2024 12:06:28 PM
యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులైన రాణి కుముదిని దేవి శనివారం ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట సందర్శించారు. ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.