22-08-2025 01:44:31 AM
టేకులపల్లి, ఆగస్టు 21 (విజయక్రాంతి):టేకులపల్లి మండలంలోని దాసుతండా గ్రామానికి చెందిన రైతు బానోత్ శంకర్ కు చెందిన మిరపనారుపై గుర్తుతెలియని వ్యక్తు లు గడ్డి మందు పిచికారీ చేసినట్టు రైతు తెలిపారు. రెండు ఎకరాల సరిపడా మిర్చి 20 ప్యాకెట్ తీసుకొచ్చి నారు చల్లిన ఆ నారు మొత్తం కాలిపోయిందనీ తెలిపారు. కక్ష సాధింపుతో ఇలా చేసి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కడుపుపై కొట్టడం మంచిది కాదని గ్రామస్తులు తెలిపారు. నిందితులను గుర్తించి న్యాయం చేయాలని బానోత్ శంకర్ వేడుకుంటున్నారు.