calender_icon.png 22 August, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ ఒకటిన కొత్త రేషన్

22-08-2025 12:37:50 AM

  1. నూతన కార్డుదారులకూ సన్నబియ్యం
  2. కోటా కేటాయించిన ప్రభుత్వం
  3. జిల్లాలో మరో 18,802 మందికి లబ్ది

మెదక్, ఆగస్టు 21 (విజయక్రాంతి): కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే నెలలో వారికి సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. కార్డుదారుల సంఖ్యకను గుణంగా అవసరమైన కోటా  కేటాయిం చింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే పంపిణీలో వీరంతా లబ్ది పొందనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. 

సెప్టెంబర్ కోటా పంపిణీకి ఏర్పాట్లు...

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి కోటాను గత జూన్లో ఒకేసారి పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో సెప్టెంబర్ కోటా పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రేషన్ షాపులకు సంబంధించిన డైనమిక్ కీ రిజి స్ట్రార్ (డీకేఆర్) స్పష్టం కావడంతో జిల్లాకు అవసరమైన బియ్యం కోటా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని.. ఎంఎల్ ఎస్ పాయింట్లకు బియ్యం చేరనున్నాయి. త్వరలోనే సరఫరా ప్రారంభమయ్యే అవకాశ మున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి వాటి పరిధిలోని చౌకధరల దుకాణాలకు చేరవేయనున్నారు. 

పెరిగిన కార్డులు..బియ్యం కోటా..

పదేళ్ళ నిరీక్షణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టింది. అలాగే కొత్త సభ్యులను చేర్చేందుకు సైతం అవకాశం కల్పించింది.  జిల్లాలో కొత్తగా 18,802 కార్డులు మంజూరయ్యాయి. వాటి పరిధిలో కార్డుదారులతో పాటు సభ్యలుకు సంబంధించి 80,066 మంది చేరారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,13,777 రేషన్కార్డులు ఉండగా వీటి పరిధిలో 6,85,178 మంది సభ్యులు ఉన్నారు.

తాజాగా జారీ చేసిన కార్డులతో ఈ సంఖ్య 2,32,579కు పెరిగింది. అలాగే యూనిట్ల సంఖ్య 7,65,244 కు చేరింది. కార్డుల సంఖ్యతో పాటు బియ్యం కోటా కూడా పెరిగింది. ఇప్పటి వరకు ప్రతీనెలా 4,368.73 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తుండగా పెరిగిన కార్డుల సంఖ్యకనుగుణంగా ఈనెలకు 4,850 మెట్రిక్ టన్నులు కేటాయిం చారు. నూతన కార్డుదారులందరికీ సెప్టెంబర్ కోటా కింద 1వ తేదీ నుంచి బియ్యం అందజేయనున్నారు. 

బియ్యంతో పాటు సంచి ఫ్రీ..

కార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన సంచులను సైతం అందించాలని నిర్ణయించింది. వైట్ కలర్లో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం రేవంత్రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిల ఫోటోలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం, ఆరు గ్యారంటీల పథకాల వివరాలు ముద్రించా రు. రూ.50 విలువ చేసే ఈ సంచిని బి య్యంతో పాటు ఉచితంగా అందజేయనున్నారు. ఈ బ్యాగులు సైతం జిల్లాకు చేరాయి. 

బియ్యం కోటా పెరిగింది..

జిల్లాలో కొత్తగా జారీ చేసిన కార్డులకు అనుగుణంగా ప్రభుత్వం బియ్యం కోటా విడుదల చేసింది. జిల్లాకు అవసరమైన సన్న బియ్యంను ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా అవుతుందని, అక్కడి నుంచి షాపుల వారీగా సరఫరా చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి కార్డుదారులందరికీ అందజేస్తాం. సెప్టెంబర్ నెల కోటా కింద 481.235 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పెరిగింది.

 నిత్యానంద్, డీసీఎస్వో, మెదక్