13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

08-01-2026 12:16 AM

మానకొండూర్, జనవరి 7 (విజయ క్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్‌ఎండి రిజర్వాయర్ జలాల నుండి పూడికతీత, పూడిక నుండి ఇసుక వేరు చేసే విధానాన్ని, ఇసుక క్వారీ నిర్వహణను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట పరిమితికి మించి ఇసుక తరలించినా, కేటాయించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాలు క్వారీలోకి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ లోడింగ్ వేయింగ్ సమయంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక కేటాయింపు ఉండాలని, తనిఖీల్లో అక్రమాలు బయటపడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిఈఈ శ్రీనివాస్, ఏఈఈ సంజన, ఏఈ వంశీధర్, తదితరులు పాల్గొన్నారు.