24 June, 2026 | 2:32 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

మైనర్‌లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

06-01-2026 12:00 AM

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం

సూర్యాపేట, జనవరి 5 (విజయక్రాంతి) :  మైనర్ లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మూడు సంవత్సరాల వరకు లైసెన్స్ రాదని డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే జైలు పాలవతారని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం అన్నారు.

సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 లో భాగంగా పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే.నరసింహ ఆదేశాల మేరకు ప్రతిరోజు రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 నిర్వహిస్తున్నామన్నారు. త్రిబుల్ రైడింగ్ చేసి రోడ్డు యాక్సిడెంట్లకు పాల్పడవద్దని, రోడ్డు యాక్సిడెంట్ జరిగితే మీ కుటుంబం రోడ్డు మీద పడుతుందని, రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని కోరారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం నుంచి బయట పడవచ్చు అని సూచించారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.