14 July, 2026 | 3:11 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి..

11-09-2025 06:21 PM

మంత్రి జూపల్లికి విద్యార్థి సంఘాల జేఏసీ వినతి..

అదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జోడేఘాట్ లో కొమరం భీం వర్ధంతి సాక్షిగా జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, కానీ హామీని విస్మరించి జిల్లా విద్యార్థులకు మోసం చేశారని విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గెడం కేశవ్ అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వం జిల్లా విద్యార్థుల భవిష్యత్ పై దృష్టిసారించి జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ నేలకోల్పాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)ను కలిసి విద్యార్థి సంఘాల జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. 

ఈ సందర్భంగా జేఏసీ చైర్మైన్ కేశవ్ మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లా అన్ని వనరులు కలిగినటువంటి జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎనుకబడిన ఆదివాసి, గిరిజన నిరుద్యోగులు అధికంగా ఉన్నారని, ఇతర ప్రాంతాల్లో కోచింగ్ కు వెళ్లాలంటే వేలల్లో, లక్షలలో ఫీజులు చెల్లించాలని, కావున ఆదివాసి గిరిజన నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టి సారించి తక్షణమే జిల్లాలో ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ సలాం వరుణ్, సమన్వయకర్త మడవి గణేష్. నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.