30 July, 2026 | 5:48 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

యాంటీ ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన

26-09-2025 12:00 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనాపూర్  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో గురువారం ఆంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి ఘట్కేసర్ ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి, సబ్ ఇన్ స్పెక్టర్ ఎ. శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఆంటీ ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.

ర్యాగింగ్లో పాల్గొనడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, శిక్షలు, ర్యాగింగ్ను నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వారు విద్యార్థులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లు డాక్టర్ కె. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కాశ్యప్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జి. నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా  నిర్వహణ, అధ్యాపకులు, విద్యార్థులు రాచకొండ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.