3 April, 2026 | 3:34 PM

Breaking News

సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •  

విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి

02-07-2025 08:38 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని, ఇష్టంతో చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎస్ఐ మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) అన్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం గిరిజన బాలికల పాఠశాల/జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలు, బాలికల భద్రత, మత్తు పదార్థాలు, వాటి పర్యవసానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, తమ జీవితాలను సక్రమ మార్గంలో మలుచుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

వాహనాల తనిఖీ

కేసముద్రం పట్టణంలో పోలీసులు ప్రత్యేకంగా వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్నారు. ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరు నియమాలు తప్పకుండా పాటించాలన్నారు.