17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

26-11-2025 05:56 PM

సుల్తానాబాద్ ఎస్సై వేణుగోపాల్ 

సుల్తానాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై వేణుగోపాల్ అన్నారు, బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ, పీజీ కళాశాలలో రామగుండం కమిషనరేట్  కళాబృందం వారిచే  డ్రగ్స్, షీ టీం,100 డయల్, సైబర్ క్రైమ్, మొదలైన వాటిపై అవగాహన సదస్సు ఆటపాటలతో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుల్తానాబాద్ ఎస్సై వేణుగోపాల్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ సైబర్ క్రైమ్ మొదలైన వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అలాంటివి ఎక్కడ కనబడ్డా 100 కు డయల్ చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై వేణుగోపాలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తన పాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థులు తమకు సమాజంలో ఏర్పడే కష్టాలు ఇబ్బందుల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ వాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలు, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.