14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

మహాలక్ష్మి పథకం పేరిట మభ్యపెడుతున్నారు

07-08-2025 11:44 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ (విజయక్రాంతి): నిన్నటి దాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాటలు పెట్టారని, ఇప్పుడు మహాలక్ష్మిపేరిట మభ్యపెట్టి అక్కాచెల్లెళ్ల జట్లు పట్టుకొని కొట్టుకునేలా చేస్తారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కోసం మొదలైన ఇలాంటి ఘర్షణలు పల్లెపల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉందని గురువారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. కోటి మందిని కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు.. కనీసం గ్యారెంటీ కార్డులో పెట్టిన రూ.2,500ల మహాలక్ష్మి హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.