28-08-2025 06:10:46 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను, జెండా వెంకటాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను విజిలెన్స్ అధికారులు, ఏఓ శ్రీకాంత్(AO Srikanth)తో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూరియా నిల్వలను, రైతులకు, డీలర్స్ అందించిన బిల్స్, డీలర్స్ కి కంపెనీల నుంచి వచ్చిన స్టాక్స్, లైసెన్సులు అన్ని కలిగి ఉండాలని హెచ్చరించారు. ఈ తనిఖీ విజిలెన్స్ లో ఎస్పి శ్రీనివాస రావు, సిఐ ప్రశాంత్, ఏఇ సి.హెచ్ సురేష్, ఏవో శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.