29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

పిల్లాయిపల్లి కాలువకు గండి పడి నీట మునిగిన వరి పొలాలు

04-11-2025 09:36 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో పిలాయిపల్లి కాలువకు గండి పడి రైతులు పండించిన పంట నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లాయి పల్లి కాలువకు గండి పడడంతో పంటచేలకు ఐదు రోజులుగా భారీగా వర్షపు నీరు చేరుతోంది. వరి పొలాలు పూర్తిగా నీట మునిగి  పోయి కోతకొచ్చిన పంట కండ్ల ముందటే తడిసి ముద్దవ్వగా  రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు పలుమార్లు అధికారులను సంప్రదించినా, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కాలువ గండి మూసివేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.