13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నేటి యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద

13-01-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి12: సమాజంలో నేటి యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని జాజిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు.  పంచాయతీ కార్యదర్శులు దేవులపల్లి నవీన్ రెడ్డి, మాగి నాగయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, వల్లాల ఖాజా నాయకులు బొల్లం సైదులు, ఎల్లెంల కొమురెల్లి, కుంభం సత్తయ్య, సత్తిరెడ్డి, లింగయ్య, నరహరి, వీరయ్య, వెంకన్న, మహేష్  పాల్గొన్నారు.