16 April, 2026 | 1:02 AM

అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలపై చర్యతీసుకోండి

06-05-2025 12:00 AM

కరీంనగర్, మే 5 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గడువు ముగిసినందున అక్రమంగా  కరీంనగర్ లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులను  గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని బిజెపి నాయకులు కోరా రు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.