15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

పాఠశాలకు ఉపాధ్యాయుడి చేయూత

06-01-2026 08:20 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): తాను పనిచేసే పాఠశాలకు చేయూతనందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని మండల విద్యాధికారి చత్రునాయక్ అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బోళ్ల గోవిందరెడ్డి అనే ఉపాధ్యాయుడు రూ.5 వేల ఆర్థిక సహాయంతో ఐదు చెత్త బుట్టలు, మూడు డ్రమ్ములు మంగళవారం పాఠశాలకు అందించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి పాల్గొని మాట్లాడుతూ... పాఠశాలకు అవసరమైన చిన్నచిన్న పనులకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థిక సహాయాన్ని అందించి ఇతరులకు ఆదర్శంగా నిలవడం హర్ష నియమన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయుడు బోళ్ల గోవిందరెడ్డిని ఆయన అభినందించారు.